జెడి లక్ష్మీనారాయణ చేతుల మీదుగా సన్మానం అందుకున్న జనసేన ఆర్కే

గుడివాడ నియోజకవర్గం: కృష్ణాజిల్లా గుడివాడ పట్టణ స్థానిక ఎన్జీవో హోంలో ఉపాధ్యాయుల దినోత్సవము సందర్భంగా మంగళవారం కంచనపల్లి నాగరత్నకుమారి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులతో పాటు గుడివాడ పట్నంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న జనసేన ఆర్కే ని మాజీ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ అభినందించి సన్మానం చేసారు. ఈ సందర్భంగా జెడి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గుడివాడ పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న గుడివాడ పట్టణ ఆర్కే వారియర్స్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని యువత సమాజానికి తమ వంతు సేవా కార్యక్రమాలు చేస్తు ఉండాలని. అనాధ మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తూ, ఆకలితో ఉన్న అనార్ధలకు ఆహారం అందజేసి ఆకలి చావులు లేకుండా చేస్తున్న ఆర్కే వారియర్స్ ఎప్పుడు ప్రజల హృదయాల్లో ఉండిపోతారని ఆ భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిధులందరూ ఆర్కే వారియర్స్ ని అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కంచనపల్లి రత్న కుమారి సేవా ట్రస్ట్ సభ్యులు మరియు ఉపాధ్యాయులు పాల్గొవడం జరిగింది.