క్షేత్రస్థాయిలో జనసేనను బలోపేతం చేయాలి: డా. గంగులయ్య

పాడేరు నియోజకవర్గం: జి.మాడుగుల మండలంలో జనసేన పార్టీ కార్యాలయంలో పాడేరు నియోజకవర్గ పరిధిలో వివిధ మండలాల జనసేనపార్టీ నాయకులతో అరకు పార్లమెంట్ జనసేనపార్టీ ఇన్చార్జ్ డా. గంగులయ్య సమావేశమ్య్యారు. ఈ సందర్బంగా డా. గంగులయ్య మాట్లాడుతూ.. రానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా అన్ని మండలాల నాయకులు, జనసైనికులు, వీరమహిళలు సర్వ సన్నద్ధతో ఉండాలని, ప్రజల నుంచి జనసేనకు ఆదరణ బాగుందని క్షేత్రస్థాయిలో పార్టీ సిద్ధాంతలు ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిన బాధ్యత మండల నాయకులు తీసుకోవాలని సూచించారు. పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర ఆంధ్రప్రదేశ్ లో ప్రభంజనం సృష్టించిందని అతని దార్శనికత విలవలుగల రాజకీయాలను ఆదివాసీ ప్రజలు ఆదరిస్తున్నారు. మనమంతా కలిసి గ్రామపర్యటన వేగవంతం చెయ్యాలి. రానున్న రెండు నెలల్లో విపరీతమైన రాజాకీయ సమీకరణాలు చోటు చేసుకోనుంది. అందుకు సిద్ధంగా ఉండాలని గంగులయ్య మండల నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్, పలు మండలాల నాయకులు భీమన్న మసాడి, మురళీకృష్ణ నందోలి, బుజ్జిబాబు వంతల, గొంది మురళి, నాగేశ్వరరావు, రమేష్ తాంగుల, మస్తాన్, పవన్ కళ్యాణ్ వంతల, సింహాచలం మసాడి, ఈశ్వర్రావు సాగెని, భానుప్రసాద్ కొర్ర పలువురు జనసైనికులు పాల్గొన్నారు.