కాకినాడ జిల్లాకు నాయకర్ పేరు పెట్టేందుకు జనసేన సహకరించాలి

తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ మల్లాడి సత్యలింగ నాయకర్ జిల్లా ఐక్య సాధన సమితి ఆధ్వర్యంలో జనసేన జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ సమక్షంలో జనసేన రాష్ట్ర పిఏసీ సభ్యులు నాదెండ్ల మనోహర్ కి కాకినాడ జిల్లాకు మల్లాడి సత్యలింగ నాయకర్ పేరు పెట్టాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి, జిల్లా జనసేన పార్టీ తీర్మానం చేసారు గనుక, జనసేన రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో చర్చించి, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ ద్వారా వారి నిర్ణయాన్ని తెలియజేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మత్స్యకార వికాస్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు బొమ్మిడి నాయకర్, మల్లాడి రాజు, ఆకుల ప్రవీణ్, కొక్కిలిగడ్డ గంగరాజు, ముగి శ్రీనివాస్, పంతం వెంకటరమణ, డొక్కా డి శ్రీను సమితి సభ్యులు పాల్గొన్నారు.