దయనేడు గ్రామంలో జనసేన శ్రమదానం

శ్రీకాళహస్తి నియోజకవర్గం, తొట్టంబేడు మండలం దయనేడు గ్రామానికి బస్సు సౌకర్యం లేదని గ్రామస్థులు జనసేన పార్టీ దృష్టికి శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా నో మై కాన్స్టిట్యూఎన్సీ కార్యక్రమంలో భాగంగా పర్యటించినప్పుడు తెలిపారు.
ఆ గ్రామానికి వెళ్ళే దారి గుంతలమయం అయినందున బస్ రాకపోకలకు నిలిపివేయడం జరిగింది. అధికారుల దృష్టికి జనసేన పార్టీ తీసుకుని వెళ్ళినా జిల్లా కలెక్టర్, మండల అధికారులు స్పందించక పోవడంతో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు నియోజకవర్గ ఇంఛార్జి వినుత కోటా ఆధ్వర్యంలో ఆదివారం శ్రమదానం చేసి కలవకుంట నుండి దయనేడుకు వెళ్లే 2 కి.మీ మేర రోడ్డులో ఉన్న గుంతలను పూడ్చి బాగుచేయడం జరిగింది. రోడ్డుకు ఇరువైపులా అడ్డుగా ఉన్న చెట్లను తొలగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మండల అధ్యక్షులు కొప్పాల గోపి, శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షుడు భవాని శంకర్, నాయకులు రవి కుమార్ రెడ్డి, నితీష్ కుమార్, గణేష్, గాంధీ, బాలాజీ, కాటేశ్, వెంకటరమణ, గిరీష్ తదితరులు పాల్గొన్నారు.