ప్రభుత్వం విజయనగరం జిల్లాకు క్యాన్సర్ ఆసుపత్రి మంజూరు దీక్షకు జనసేన సంఘీబావం

విజయనగరం, ప్రభుత్వం విజయనగరం జిల్లాకు క్యాన్సర్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంజూరు చేయాలని స్థానిక మయూరి జంక్షన్లో విజయనగరం యూత్ ఫౌండేషన్ సహకారంతో ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి సాధన సమితి ఆద్వర్యంలో జేఏసీ అద్యక్షుడు బీశెట్టి బాబ్జీ, జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు) సత్యాగ్రహ దీక్ష చేపట్టటం జరిగింది. ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి సాధన సమితి జేఏసీ దీక్షకు సంఘీభావంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి, జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు, వబ్బిన సత్తిబాబు, వంక నరసింగరావు, జనసేన యువ నాయకులు రౌతు సతీష్, లోపింటి కళ్యాణ్, చెల్లూరి ముత్యాల నాయుడు, దాసరి యోగేష్ హాజరయ్యారు.