జనసేన ఆత్మీయ సమావేశం

రంపచోడవరం, వి.ఆర్.పురం మండలం రేఖపల్లి గ్రామ శివారులో జనసేన పార్టీ మండల కమిటీ మరియు నాలుగు గ్రామాల ముఖ్య నాయకులు, జనసైనికులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మరో మూడు రోజుల్లో జరగబోయే ఎన్నికల గురించి మరియు ఉమ్మడి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల రోడ్ షో గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ములకాల సాయికృష్ణ మాట్లాడుతూ జనసైనికులంతా కలిసికట్టుగా సమన్వయంతో ఉండాలని మనం దైవంతో సమానంగా కొలిచే అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు బాగుల ప్రమీల,టిడిపి మండల అద్యక్షులు ఆచంట శ్రీనివాస్, జెడ్పీటీసీ వాళ్ళ రంగారెడ్డి, జనసేన పార్టీ మండల మండల ప్రధాన కార్యదర్శి కోట్ల రామ్మోహన్ రెడ్డి, చోడే గంగాధర్,పెట్టా నాగేంద్ర,మండల కార్యదర్శిలు బాగుల అంజనరావు,కెచ్చల పోషి రెడ్డి, పరంకుశం మణికంఠ, పసుపులేటి నవీన్, కోట్ల రాజిరెడ్డి యూత్ నాయకులు గూటాల సమ్మరాజు, పెడపెట్ల పవన్ కళ్యాణ్, ముంజపు సాయిరాం, చింతకాయల భవాని శంకర్, కాపారపు పవన్, సాయిరాం, సాయి కుమార్, దుర్గా ప్రసాద్, పవన్, రాజేష్, పండు తదితరులు పాల్గొన్నారు.