బాజి కుటుంబానికి అండగా జనసేన

నందిగామ, జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణకి ప్రత్యేక ధన్యవాదములు నందిగామ నియోజకవర్గం, కంచికచర్ల మండలం జనసేనపార్టీ నాయకులు ముస్లిం సోదరులు బాజి ఇటీవల గుండెపోటుతో మరణించడం జరిగింది. బాజి జనసేనపార్టీ కోసం ఎంతో కష్టపడి పని చేసేవారు. అలాంటి బాజి పార్టీకి దూరం అవడం చాలా బాధాకరం. ఈరోజు ఆ కుటుంబానికి జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కార్యకర్తకు అండగా నిలిచారు. పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్, కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ చేతుల మీదగా బాజి కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. దీనికి పూర్తి సహకారం అందించిన జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణకి హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు.