జనసైనికుల కుటుంబానికి జనసేన అండగా ఉంటుంది: చిర్రి బాలరాజు

పోలవరం నియోజకవర్గం: జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు, జనసైనికుడు బద్దిరెడ్డి రవికుమార్‌ గత ఏడాది అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఆయనకు ఇద్దరు చిన్న బిడ్డలు పేద కుటుంబం, అప్పట్లో పార్టీ పెద్దలు ఏమైనా కష్టం వస్తే ఆదుకుంటాం అని హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తన భార్య బద్దిరెడ్డి అంజలికి తీవ్ర అనారోగ్యంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఇచ్చినమాటకు గాను గురువారం ఉమ్మడి పశ్చిమగోదావరిజిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి 50,000 రూపాయలు బద్దిరెడ్డి అంజలి బిడ్డలకి ఇంచార్జ్‌ చిర్రి బాలరాజు చేతుల మీదుగా అందజేయడం జరిగింది. మాటలు చెప్పి చేతులు దులుపుకునే పార్టీ మాది కాదు, ఇచ్చిన మాటకోసం ఎంత వరకైనా వస్తామని, కార్యకర్తలు, జనసైనికులకు అండగా మేము ఉన్నామని చిర్రి బాలరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చిన్ని, కొయ్యలగూడెం మండల అధ్యక్షులు తోట రవి, పాదం కృష్ణ, మండల కమిటీ సభ్యులు, క్రియాశీల వాలంటీర్స్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.