అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి అండగా జనసేన

పార్వతీపురం నియోజకవర్గం: నర్సిపురం గ్రామంలో బుధవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జనసైనికులు సమక్షంలో గురువారం మండల అధ్యక్షురాలు ఆగురు మణి ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు సమక్షంలో ప్రమాద బాదితులైన మాచర్ల శ్రీరామ్, మాచర్ల రాజేశ్వరిలను పరామర్శించడం జరిగింది. రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు వారికి భరోసాని ఇచ్చారు. వారికి ధైర్యాన్ని నింపారు. వారికి నెలకు సరిపడిన నిత్యవసర సరుకులు ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా మానవతా దృక్పథంతో ముందుకు వెళ్దామని చెప్పడం జరిగింది. మీకు ఎటువంటి ఇబ్బంది కలిగిన జనసేన పార్టీ ఉందని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు బొబ్బిలి మండల అధ్యక్షులు గంగాధర్, ఖాతా విశ్వేశ్వరరావు, గుండ్రెడ్డి గౌరీ శంకర్, కర్రీ మణికంఠ, పోతుల శివశంకర ఆగూరు శ్రీను పాత్ర పవన్, తాన చిన్నమనాయుడు, పైళ్ల అప్పలరాజు, సిద్ధాంతపు గణేష్, యోగి రెడ్డి ప్రసాద్, సాయి, శేఖర్, పాండ్రికి మనోజ్, అనిల్, వికాస్, జనసైనికులు అందరికీ పేరుపేరునా ధన్యవాదములతెలిపారు.