ప్రజా సమస్యలపై పోరాడే వారికి జనసేన అండగా ఉంటుంది

పాలకొండ నియోజకవర్గం: ప్రజా సమస్యలపై పోరాడే వారికి జనసేన అండగా ఉంటుందని జనసేన జానీ పేర్కొన్నారు. సోమవారం జానీ మాట్లాడుతూ మా అధ్యక్షులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు పాలకొండ పట్నం లో మునిసిపల్ డిపార్ట్మెంట్ కి సంబందించిన పారిశుద్ధ్య కార్మికులు స్వీపర్లు చేపట్టే దీక్షలో మానవహరణ కార్యక్రమంలో పాల్గొన్న పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ తరుపున జనసేన రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో మునిసిపల్ కార్మికులు సమ్మె కారణంగా వారి సమస్య పరిష్కారం ప్రభుత్వం చెయ్యకపోవడంతో ఎక్కడ చెత్త అక్కడే ఉండిపోతుంది అసలకే కరోనా ఒక పక్కన పొంచి ఉంటుంటే వైస్సార్సీపీ ప్రభుత్వం వారి సమస్య పరిష్కారం చెయ్యకపోతే ప్రజలు ప్రాణాలకి కూడా ప్రమాదం ఉంటుంది. కనుక వారి కార్మికులు సంఘాలుతో మాట్లాడి తొందరగా వారికి అనుకూలంగా చర్చలు సఫలం అవ్వాలి అని లేదంటే చెత్త పేరుకుపోయి దుర్గందభరితమైనటువంటి వాతావరణం తయ్యారవుతుంది తద్వారా ప్రజలుకి అనేకమైన రోగాలు వచ్చే పరిస్థితి ఎర్పాడుతుంది. లేని పక్షంలో వైస్సార్సీపీ నాయుకులకి ఒకొక్కరికి లక్షరూపాయిలు జీతం ఇస్తాము మీరు చెయ్యగలరా అని ప్రశ్నిస్తున్నాను అని జనసేన జానీ ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై పోరాడే వాళ్ళకి జనసేన ఎప్పుడు అండగా ఉంటుందని ఈ సందర్బంగా జనసేన జానీ తెలియచెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఐటీయూ దావల రమణ మునిసిపాల్ బాధ్యతలు మునిసిపాల్ ఆఫీస్ నుంచి చెక్ పోస్ట్ కూడలి వరుకు జనసేన సీఐటీయూ ఆదర్యంలో పాదయాత్ర చెయ్యడం జరిగింది. 2024లో జనసేన టీడీపీ ప్రభుత్వం స్థాపించడం కాయం మీ సమస్యలు పరిష్కారం చెయ్యడం జరుగుతుంది. కనుక జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్బంగా పాలకొండ నియోజకవర్గ జనసేన జానీ పిలుపునిచ్చారు.