లక్కవరపుకోటలో జనంలోకి జనసేన ప్రారంభం

శృంగవరపు కోట నియోజవర్గం, లక్కవరపుకోట మండలంలో ఆదివారం జనంలోకి జనసేన అనే కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఈ జనంలోకి జనసేన అనే మహోత్తర పాదయాత్ర ముందుగా లక్కవరపుకోట మండలంలో గొలుజం, కళ్ళెంపూడి, సీతారాంపురం గ్రామాలలో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ద్వారా జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసే ప్రభుత్వ కార్యక్రమాలు అలాగే ప్రభుత్వ పథకాలు ప్రజలకు వివరించడం జరిగింది. అలాగే రైతుల కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న ఎన్నో కార్యక్రమాలు ప్రజలకు వివరించడం జరిగింది. రానున్న ఎన్నికలలో పవన్ కళ్యాణ్ కి అవకాశం ఇవ్వాలని ప్రజల కోరడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నియోజవర్గ ముఖ్య నాయకులు వబ్బిన సత్యనారాయణక, వబ్బిన సన్యాసి నాయుడు, వేపాడ మండల అధ్యక్షులు అయిన సుంకరి అప్పారావు, అలాగే విశాఖ పార్లమెంట్ మెంబర్ జొన్నపల్లి సత్తిబాబు, లక్కవరపుకోట మండల ముఖ్య నాయకులైన రామెల్ల శివాజీ, అలాగే షేక్ ఫిరోజ్, అలమండ రాంబాబు, వెన్ను రాజు, గొర్లి శ్రీను అలాగే ఎస్. కోట మండల అధ్యక్షులు అయిన రామకోటి అలాగే కోళ్ల మధు, రుద్ర నాయుడు జామి మండల నాయకులు అయిన రాజులకు ఈ కార్యక్రమాన్ని ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.