అంగన్వాడిల సమ్మెకు జనసేన మద్దతు

అనంతపురం: అనంతపురం నియోజకవర్గంలో తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడి అక్క చెల్లెమ్మలకు జనసేన పార్టీ తరఫున పూర్తిగా మద్దతిస్తున్నామని అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి పేర్కొన్నారు. అంగన్ వాడీలు చేపట్టిన సమ్మెకు మద్దతు తెలిపి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలకు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ తక్షణమే భేషరతుగా నెరవేర్పించాలి. అంగన్వాడీలకు నిమిత్తం వేతనంగా నెలకి 26 వేల రూపాయలు చెల్లించాలి, సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారం డి.ఎ చెల్లించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు అర్బన్ ఇంచార్జ్ టి.సి వరుణ్, రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ శ్రీమతి పెండ్యాల శ్రీలత, జిల్లా ఉపాధ్యక్షులు జయరామిరెడ్డి, అంకె ఈశ్వరయ్య, నగర అధ్యక్షులు బాబు రావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు పత్తి చంద్రశేఖర్, కుమ్మర నాగేంద్ర, జిల్లా కమిటీ సభ్యులు అవుకు విజయ్, ముప్పురి కృష్ణ నగర కమిటీ సభ్యులు పెండ్యాల చక్రపాణి, వళ్ళంశెట్టి వెంకట రమణ, లాల్ స్వామి, హుస్సేన్, ఆకుల అశోక్, సంపత్ కుమార్, కార్యనిర్వహక సభ్యులు సంతోష్ కుమార్, వీరమహిళలు శ్రీమతి శైలజ, శ్రీమతి గాయత్రి, శ్రీమతి అసీద్, శ్రీమతి చంద్రకళ, కుమారి సానియా, శ్రీమతి అనసూయ, శ్రీమతి వర్షిత, శ్రీమతి అంజలి, శ్రీమతి అరుణ జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.