సాంబమూర్తినగర్ ప్రాంతంలో జనసేన విజయీభవ కార్యక్రమం

కాకినాడ సిటి: జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నేత్రుత్వంలో బుడితి హేమ, బుడితి సన్నీ ఆధ్వర్యంలో 6వ డివిజన్, సాంబమూర్తినగర్ ప్రాంతంలో విజయీభవ అనే వినూత్న కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముత్తా శశిధర్ ని స్థానిక ప్రజలు స్వాగతిస్తూ విజయహారతి పట్టారు. జనసేన పార్టీ సిద్ధాంతాలను మేనిఫెస్టోను ఈ సందర్భంగా ముత్తా శశిధర్ వారికి వివరించారు. సమాజంలో చేనుకు నీరు ఎంత ముఖ్యమో చేతికి పని అన్నది కూడా అంతే ముఖ్యమని అన్నారు. అభివృద్ధితో పాటు సంక్షేమం అమలు పరిచేలా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీలు దృష్టిపెట్టాయనీ మీరందరి ఆశ్శీస్సులతో రాబోయే ఎన్నికలలో గెలుపు సాధించి ప్రజారంజక పాలనని సాధిస్తామని హామీనిచ్చారు. నేడు యువత ప్రోత్సాహంలేక భవిష్యత్తుపై ఆందోళనలో ఉందనీ తమ ప్రభుత్వం వచ్చాకా యువతకి జనసౌభాగ్య పధకంలో సొంతంగా వ్యాపారాలు, పరిశ్రమలు పెట్టుకుని ప్రయోజకులు అయ్యేలా బాధ్యత తీసుకుంటామని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో మల్లిజేటి లక్ష్మి, ఇసరుపు నితిన్, నల్ల నవీన్, మారకాని నితిన్, జాడ రాజు, పచ్చిపాల శీను తదితరులు పాల్గొన్నారు.