జనసేన విజయ యాత్ర – ఏపి నీడ్స్ పవన్ కళ్యాణ్ 27వ రోజు

శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా శ్రీకాళహస్తి నియోజకవర్గం, రేణిగుంట పట్టణంలో వి.ఎం స్ట్రీట్ లో గురువారం ఇంటింటికీ ప్రచారం నిర్వహించి ఉమ్మడి మినీ మానిఫెస్టోను ప్రజలకు వివరించడం జరిగింది. రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ నాయకత్వం అవశ్యకతను వివరించడం జరిగింది. మరియు ప్రజలకు ఈ వైసీపీ ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మదు రెడ్డి చేస్తున్న అవినీతి, అక్రమాలను, దోపిడీలను వివరించడం జరిగింది. రానున్న ఎన్నికల్లో జనసేన – టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంను ఆశీర్వదించాలని, తద్వారా రాష్ట్ర అభివృద్దికి సహకరించాలని కోరడం జరిగింది. భూముల రిజిస్ట్రేషన్ కి విచ్చల విడిగా సబ్ రిజిస్ట్రార్ , రేణిగుంట ఎమ్మార్వో లంచాలు తీసుకుంటున్నారని ప్రజలు తెలిపారు, త్రాగు నీరు నెల రోజులుగా చాలా సమస్యగా ఉందని మహిళలు తెలిపారు. అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో భూముల అవకతవకల పై కమిటీ వేసి విచారణ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రేణిగుంట మండల ఉపాధ్యక్షులు వాకాటి బాలాజీ, చిన్నతోట నాగరాజు, పార్థసారధి, నాయకులు నగరం భాస్కర బాబు, త్యాగరాజు, పూర్ణయ్య, నాథ ముని, శ్రీనివాసులు, చిన్న, భూపతి, జ్యోతి కుమార్, వీర మహిళలు అనురాధ, ఉమా మహేశ్వరి, మాజీ ఎంపీటీసీ జయలలిత, నితీష్ కుమార్, వినోద్ కుమార్, జనసైనికులు రవి కుమార్, గోవర్ధన్, కిషోర్, ధనుష్, ప్రణీత్ కుమార్, వసంత్, రాజ్ కుమార్, రాజు, మహేష్, ఈశ్వర్, కరిముళ్ళా, వెంకీ, సాయి పవన్ తదితరులు పాల్గొన్నారు.