కోవూరు నియోజకవర్గంలో వరద ముంపు బాధితులను పరామర్శించిన జనసేన

నెల్లూరు జిల్లా, కోవూరు నియోజకవర్గం, బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు గుంటకట్ట ప్రాంతం మరియు కొత్త కాలువ గిరిజన కాలనీలో నివాసముంటున్న వరద బాధితులను నెల్లూరు జిల్లా కార్యదర్శి మరియు మైనార్టీ విభాగం జిల్లా నాయకులు షానవాజ్ పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముందు వచ్చిన వరద కారణంగా ఆ ప్రాంతమంతా జలదిగ్బంధంలో బాధితులు సర్వం కోల్పోయి, ప్రాణాలు అరచేతిలో పట్టుకుని కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. కనీస తాత్కాలిక వసతి కల్పించి వారికి ప్రభుత్వం ద్వారా ఇల్లు కట్టి ఇవ్వాలని, ఇంటిలో కనీసం సామాన్లు ఇచ్చి ప్రభుత్వం వారికి భరోసా కల్పించాలని, అలాగే గుంటకట్ట ప్రాంతంలో నివాసం ఉన్న వారికి కనీసం వాలంటరీ వ్యవస్థ కూడా అందుబాటులో లేదని, వృద్ధాప్య పెన్షన్ కూడా ఇవ్వడం లేదని చాలామంది వృద్ధులు కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది.