గజపతినగరంలో జనంతో జనసేన

గజపతినగరం నియోజకవర్గం, గజపతినగరం మండలంలో రామన్నపేట జీన్నము యం లింగాలవలస గ్రామాల్లో గజపతి నగరం నియోజకవర్గం నాయకులు గెద్ద రవి మరియు దత్తిరాజేరు మండలం జనసైనికులు మామిడి దుర్గాప్రసాద్ మురళి గజపతినగరం మండలం జనసైనికులు పి సత్యనారాయణ పర్యటించారు. ఆ గ్రామంలో ఉన్న జనసైనికులు మరియు గ్రామ పెద్దలను కలిసి జనసేన పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఇందుకు వారు సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా గెద్ద రవి గారు మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న పెద్దలకు మరియు ప్రజలకు జనసేన పార్టీ సిద్ధాంతాలను విధివిధానాలను వివరిస్తూ రాబోయే శాసనసభ ఎన్నికల్లో జనసేన పార్టీని గెలిపించమని కోరడం జరిగింది అనంతరం గెద్ధ రవి మాట్లాడుతూ ఇదేవిధంగా ప్రతి గ్రామంలో జనసైనికులు కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జనసైనికులును కోరారు.