అరుణ్ కుమార్ కుటుంబానికి జనసేన పరామర్శ

కళ్యాణదుర్గం నియోజకవర్గం: బ్రహ్మసముద్రం మండలం, ఎరడికెర గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు మొండి అరుణ్ కుమార్ గత 3 రోజుల క్రితం బుధవారం రైలు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది.. వారి కుటుంబాన్ని శుక్రవారం పరామర్శించి, మీకు జనసేన పార్టీ అన్ని విధాలుగా అండగా నిలుస్తుంది అని భరోసా ఇవ్వడం జరిగింది. అనంతరం ఫోన్లో అనంతపురం అనంతపురం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు టి సి వరుణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి మరియు అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య ఫోన్లో మాట్లాడి జనసేన పార్టీ మీకు అన్ని విధాలుగా అండగా ఉంటామని త్వరలోనే మిమ్మల్ని వచ్చి కలుస్తామని అరుణ్ కుమార్ కుటుంబానికి భరోసా ఇవ్వడం జరిగింది. ఇన్సూరెన్స్ వర్తించేలా చూస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లక్ష్మీనరసయ్య, జాయింట్ సెక్రెటరీ బాల్యం రాజేష్, బ్రహ్మసముద్రం మండల అధ్యక్షులు ఆంజనేయులు, బ్రహ్మసముద్రం మండలం ప్రధాన కార్యదర్శులు రాయుడు, కుందుర్పి మండల అధ్యక్షులు జయకృష్ణ, జనసేన వీరమహిళ షేక్ తార, జాకీర్, ముక్కన్న, విశ్వనాధ్, శివ, రమేష్, వెంకటేష్, తిప్పేరుద్ర, గోవిందు, ధనంజయ, రాజేష్, గిరీష్, ఎర్రిస్వామి, శివరుద్ర, నితిన్, శాంతి, గోపీచంద్, మాలింగ, జానీ, మహేష్, రాము, విజయ్, చైతన్య, నీలకంఠ పాల్గొన్నారు.