ఇంటింటా జనసేనకు పెరుగుతున్న ఆదరణ

  • రాజంపేట జనసేన నాయకులు
  • పవనన్న ప్రజా బాట 94వ రోజు

రాజంపేట నియోజకవర్గం, ఆకేపాడు పంచాయతీలోని రేణింతల, రేణింతల ఎస్సీ ఎస్టీ కాలనీ, నవోదయ, పలు గ్రామాలలో పవనన్న ప్రజా బాట కార్యక్రమాన్ని రాజంపేట అసెంబ్లీ ఇన్చార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు 94వ రోజు భాగంగా శుక్రవారం. రేణింతల గ్రామంలోని ప్రజలు ఈ వైసీపీ పరిపాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ.. ఇప్పుడు ఉండే ప్రభుత్వం దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజలకు ఏమి చేసింది లేదు అని ఆ గ్రామ ప్రజలకు వివరించారు. రానున్న 2024 ఎలక్షన్స్ లో జనసేనను ఆదరించండి మీకు మీ పిల్లల భవిష్యత్తు అన్ని విధాలుగా బాగుంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు భాస్కర పంతులు, గోపి, పొలిశెట్టి శ్రీనివాసుల, వీరమహిళలు శిరీష, మాధవి, తదితరులు పాల్గొనడం జరిగినది.