యువశక్తికి తరలివెళ్లిన జనసైనికులు

88 వ వార్డు, పెందుర్తి నియోజకవర్గం, నరవ గ్రామం నుండి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో యూత్ ఐకాన్ స్వామి వివేకానంద జన్మదిన సందర్భంగా ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని, యువతను నిర్వీర్యం చేసిన ప్రభుత్వ వైఫల్యాలపై, రాష్ట్ర వనరులు దోచుకుంటున్న ప్రభుత్వ పాలక నాయకుల పైన, యువతలో ఉన్న శక్తిని తట్టి లేపడానికి శ్రీకాకుళం రణస్థలంలో ఏర్పాటు చేసిన యువశక్తి కార్యక్రమానికి నరవ మరియు పరిసర గ్రామాల నుంచి జనసైనికులు యువశక్తి నినాదాలు చేసుకుంటూ తరలి వెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమంలో గళ్ళ శ్రీనివాస్, వబ్బిన జనార్థన శ్రీకాంత్, సాలపు కనకరాజు, సాలపు అప్పారావు, బొడ్డు నాయుడు, గవర శ్రీను, సర్వ సిద్దిరాజు, చిన్న, చలం, ప్రవీణ్ మరియు జన సైనికులు పాల్గొన్నారు.