జనవాణి-జనసేన భరోసా

పెడన నియోజకవర్గం, సామాన్యుడి గళాన్ని ప్రభుత్వానికి వినిపించేలా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బాధ్యత పక్షాల నుండి స్వయంగా పవన్ కళ్యాణ్ అర్జీలు స్వీకరించి, బాధితుల తరపున ప్రభుత్వంతో పోరాటం చేయనున్నారు. జూలై 3 వ తేదీన పవన్ కళ్యాణ్ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు విజయవాడ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం, ఆకుల వారి వీధి, బందర్ రోడ్డు (వంగవీటి మోహన రంగా ఇంటికి సమీపంలో) జనవాణి జనసేన భరోసా కార్యక్రమంలో పాల్గొని ప్రజా సమస్యలపై బాధిత పక్షాల నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా అర్జీలు స్వీకరిస్తారు. కావున పెడన నియోజవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని మీ సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు రావలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని పెడన నియోజకవర్గ జనసేన నాయకులు ఎస్ వి బాబు అన్నారు.