ఎరగుంటపల్లి గ్రామంలో బాబు స్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం

  • ఎరగుంటపల్లి గ్రామంలో పర్యటించిన జనసేన శ్రీకాంత్

తాడిపత్రి: బాబు స్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ టీడీపీ కార్యక్రమంలో భాగంగా సోమవారం సాయంత్రం తాడిపత్రి మండలం, ఎరగుంట పల్లి గ్రామం నందు తాడిపత్రి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ జెసి అష్మిత్ రెడ్డి పర్యటించి ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకుని, సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించాలని అభ్యర్థించారు. జెసి అష్మిత్ రెడ్డి వెంట తాడిపత్రి జనసేన సమన్వయకర్త కదిరి శ్రీకాంత్ రెడ్డి గారు, ఆచారి, కిరణ్, రామంజి, గోపాల్, శివ, యువరాజు, పవన్, హేమంత్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తాడిపత్రి మండల టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, జెసి అనుచరులు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.