గుంటూరు జనసేన ఆద్వర్యంలో ఝాన్సీ లక్ష్మీబాయి 194 వ జయంతి వేడుకలు

గుంటూరు: బ్రిటీష్ పాలనకి వ్యతిరేకంగా జరిగిన మొదటి స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించిన భారతదేశం గర్వించదగ్గ వీరమహిళ ఝాన్సీ లక్ష్మీబాయి 194 వ జయంతి ని పురస్కరించుకొని జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సందర్బంగా జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు మాట్లాడుతూ ఝాన్సీ లక్ష్మి పోరాట పటిమ అందరికి ఆదర్శం అని ఆమె స్ఫూర్తితోనే పవన్ కళ్యాణ్ మహిళల విభాగానికి వీర మహిళా విభాగం అని పేరు పెట్టడం జరిగింది అన్నారు. జిల్లా కార్యదర్శి జ్యోతి మరియు కార్పొరేటర్లు పద్మావతి, లక్ష్మి మాట్లాడుతూ జనసేన పార్టీలో మహిళలకు ఉన్నంత గౌరవం వేరే ఏ పార్టీలో ఉండదు అని, తాము కుడా పవన్ కళ్యాణ్ ఇచ్చిన దైర్యంతో లక్ష్మి భాయి గారి స్ఫూర్తితో చెడుపై పోరాటం చేస్తాం అని రాష్ట్రము లో అధర్మ పాలన అంతమొందించడంలో తమ కృషి చేస్తాం అని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, జిల్లా సంయుక్త కార్యదర్శి చట్టాల త్రినాధ్, కొర్రపాటి నాగేశ్వరావు, మల్లేశ్వరి, ఆసియా, రాజనాల నాగలక్ష్మి, హరిసుందరి, సరస్వతి, కవిత, అరుణ, జాన్ బీ, రాధికా, జమునారాణి, అనిత, భాగ్యలక్ష్మి, పద్మావతి, వరలక్ష్మి,నాగపావని, సుజాత, నెల్లూరి శివరామకృష్ణ, పతేళ్ళ మల్లి, గంగరాజు, దాసరి వెంకటేశ్వరావు, పత్తి భావాన్నారాయణ, గోపిశెట్టి సాయి, తోట వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.