పవన్ కళ్యాణ్ చిన్ననాటి స్నేహితులను కలిసిన జానీ మాస్టర్

నెల్లూరు: జానీ మాస్టర్ ని ఒకసారి కలవాలని జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుందర్ రామిరెడ్డి కోరగా వారి నివాసంలో కళ్యాణ్ గారి మిత్రులను మాస్టర్ కలిశారు. జనసేన పార్టీకి మద్దతుగా నిలబడటం చాలా సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో నెల్లూరు జిల్లాతో సమానం కలిగి ఉన్న మనందరం కూడా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించే విధంగా పనిచేయాలని.. మీరు కూడా అందులో భాగస్వామ్యం అవ్వడం సంతోషంగా ఉందని తెలిపారు. జానీ మాస్టర్ మాట్లాడుతూ ఎప్పుడు చెప్పినట్లే పవన్ కళ్యాణ్ గారు అంటే తనకు ప్రాణమని ఆయన గెలిచేందుకు ఏం చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నాను. మీరందరిని కలవడం చాలా సంతోషంగా ఉంది. పర్టికులర్గా నెల్లూరు సిటీ, రూరల్, కోవూరు ప్రాంతాలలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతు సహాయకారిగా నిలబడతానని తెలిపారు.