నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న ఎస్సీ కాలనీ వాసులు

శింగనమల నియోజకవర్గం: పేరుకు మాత్రమే ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం ఎస్సీ సమస్యలు పట్టించుకోని వైసిపి ఎమ్మెల్యే అనేక సమస్యల వలయంలో బుక్కరాయసముద్రం మండలంలోని భద్రంపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీ శింగనమల నియోజకవర్గంలోని బుక్కరాయసముద్రం మండలంలోని భద్రంపల్లిలో ఎస్సీ కాలనీలో గత మూడు నెలలుగా తీవ్ర నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న ఎస్సీ కాలనీ వాసులు ఎక్కడో మూడు కీలో మీటర్ల దూరంలో పంట పొలాల్లోకి వెళ్లి నీటిని తెచ్చుకుంటున్న కాలనీ వాసులు ఓట్ల కోసం మత్రమే ఎమ్మెల్యే నాయకులు వస్తారు కాని మా సమస్యను పట్టించుకొన్న పాపాన పోలేదని కాలనీ వాసులు అంటున్నారు. అలాగే ఎస్సీ కాలనీకి ఉన్న స్మశాన వాటిక ను కబ్జా చేశారని కనీసం మాకు స్మశనవాటిక కోసం స్థలం కూడ కేటాయించలేదని కాలనీ వాసులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ ఇంత సమస్య ఉన్న కూడా కనీసం ఎమ్మెల్యే గారు అధికారులు చర్యలు తీసుకోకపోవటం చాలా దారుణం అని వారి సమస్యను జనసేన పరిష్కారం చేస్తుందని వారం రోజుల లోపు ఎమ్మెల్యే కానీ అధికారులు కానీ ఈ కాలనీ వాసుల సమస్యలను పరిష్కరించకుంటే శింగనమల జనసేన పార్టీకి ఆధ్వర్యంలో కలెక్టరు కార్యాలయంకి వెళ్లి కలెక్టర్ ఎస్సీ కాలని సమస్యలు తెలియజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మురళి కృష్ణ, జిల్లా కార్యదర్శి చొప్ప చంద్రశేఖర్, జిల్లా సంయుక్త కార్యదర్శి విజయలక్ష్మి, పురుషోత్తం రెడ్డి, కృష్ణమూర్తి, జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సంతోష్ యాదవ్, బుక్కరాయసముద్రం మండల అధ్యక్షులు జి ఎర్రిస్వామి, వీరమహిళలు సరిత అనసూయ, నియోజవర్గ నాయకులు అరటి తాహిర్, అంచల సద్దాం ఖాన్ తదితరులు పాల్గొన్నారు.