సీఎం జగన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన పేడాడ

ఆమదాలవలస: సీఎం జగన్ రెడ్డి వ్యాఖ్యలను పేడాడ రామ్మోహన్ రావు ఖండించారు. శుక్రవారం వెంకటగిరిలో జరిగిన నేతన్న నేస్తం కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై చేసిన దిగజారుడు వ్యాఖ్యలను ఖండిస్తూ శనివారం ఆమదాలవలస జనసేన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నియోజకవర్గ జనసేన నాయకులు పేడాడ రామ్మోహన్ రావు మాట్లాడుతూ.. ఘాటుగా కౌంటర్ ఎటాక్ చేశారు. వాలంటరీ వ్యవస్థ సేకరిస్తున్న సమాచారాన్ని అంతా నానక్ రామ్ గూడ లో ఎఫ్.ఓ.ఏ అనే కంపెనీలో ఎందుకు ఉంది అని ప్రశ్నించారు?.. వైయస్సార్ సిపి పార్టీ మంత్రులు మరియు నాయకులు, పేటీఎం బ్యాచ్ అందరూ కలిసి వాలంటరీ వ్యవస్థను తప్పు తోవ పట్టిస్తున్నారని నిలదీశారు?. అలాగే వైసిపి పార్టీ నాయకులు మంత్రులకి చెప్పు చూపించారు. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారు గానీ, జనసేన పార్టీ నాయకులను గాని కించపరిచే విధంగా మాట్లాడితే వై.ఎస్.ఆర్.సి.పి పార్టీ నాయకులు మీద చెప్పులు వర్షం కురుస్తుందని ఘాటుగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పైడి మురళీమోహన్, ఎలకల రమణ, జనసైనికులు ఫణి కుమార్, అశోక్, రాజు, మున్నా, కరుణ సాగర్ తదితరులు పాల్గొన్నారు.