ఆగూరు మనీ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరికలు

పార్వతీపురం నియోజకవర్గం: పార్వతీపురం మండలం వెలగవలస గ్రామ పంచాయతీ, బిల్లగుడ్డివలస, పిండలోవా, గ్రామం లో పార్వతీపురం మండల అధ్యక్షురాలు అగూరు మణి మరియు జనసేన పార్టీ నాయకులు ఆధ్వర్యంలో జనసేన గ్రామాబాట కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ భావజాలం, సిద్ధాంతాలు నచ్చి ఆ రెండు గ్రామం నుంచి 40 కుటుంబాలు జనసేన పార్టీలో చేరడం జరిగింది.ఆ గ్రామ ప్రజలు మాట్లాడుతూ మాకు పవన్ కళ్యాణ్ నాయకత్వం అంటే ఎనలేని అభిమానం ఆయన అడుజాడల్లో నడవడం అంటే మాకు ఎంతో ఇష్టం. ఆగూరు మని మాట్లాడుతూ ఆ రెండు గ్రామాల ప్రజల కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఆ ఊరి యొక్క డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా లేదు అలాగే ఇంటింటి కొళాయిలు వేశారు వారానికి ఒక్కరోజు మాత్రమే నీరు వస్తుంది. మేము మీ కష్టసుఖాల్లో తోడుంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా జనసేన పార్టీ నాయుకులు అలాగే ప్రత్యేకంగా సీతానగరం జనసైనికులకు ధన్యవాదాలు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న సీనియర్ నాయకులు, ఖాతా విశ్వేశ్వరరావు, అల్లు రమేష్, గుంట్రెడ్డి గౌరీ శంకర్, చిట్లి గణేశ్వరరావు, సాయి కిరణ్, అన్న భక్తుల దుర్గాప్రసాద్, జయశంకర్, సోమేశ్, అక్కని భాస్కర్ రావు, ప్రశాంత్, అనిల్, శ్రీను, ముఖ్యంగా హిందూపురం గ్రామం జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు, తిప్పిలి పోలినాయుడు, బుట్ట వెంకటరమణ, ఇప్పిలి శంకర్రావు, రామకృష్ణ, మహేష్, నవీన్, కోరాడ సురేష్, బుట్ట శ్రవణ్ కుమార్, చిన్న, సోమడ గంగులు, అందరికీ పేరుపేరునా ధన్యవాదములు తెలిపారు.