శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న నందిగామ జనసేన నాయకులు

నందిగామ నియోజకవర్గం, కంచికచర్ల పట్టణం, వసంత కాలనీలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం నందు శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమమునకు జనసేన సీనియర్ నాయకురాలు శ్రీమతి తంబళ్లపల్లి రమాదేవి పాల్గొనడం జరిగింది. శ్రీ దుర్గా మాత ఆశీస్సులు నందిగామ నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడు అందరూ సుఖ శాంతులతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంచికచర్ల మండల అధ్యక్షులు నాయిని సతీష్, ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రోగ్రాం కమిటీ మెంబర్ తోట ఓంకార్, పుప్పాల వేణుగోపాల్, వనపర్తి పద్మారావు, కంభంపాటి రమాదేవి, జనసైనికులు, జనసేన పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు శ్రేయోభిలాషులు అందరూ పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.