దేవ సమక్షంలో వైసిపి పార్టీ నుండి జనసేనలో చేరికలు

రాజోలు, వైసిపి పాలనలో పడిన కష్టాలు, జీవనాధారం లేక ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్ళిపోయే పరిస్థితులు రావడం, ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి అభివృద్ది లేని రాష్ట్రంగా తయారుచేసిన ఈ వైసిపి జగన్ రెడ్డిని గద్దెదింపి ప్రజల కోసం రాష్ట్ర అభివృద్ది కోసం నిరంతరం శ్రమించే వ్యక్తి పవన్ కళ్యాణ్ సిద్దాంతాలు నచ్చి అంతర్వేది పాలెం మొర్లకొడపలో జనసేన మండల అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్, సలాది మూర్తి, రాష్ట్ర మత్యకార విభాగ కార్యదర్శి పొన్నల ప్రభ, బర్రె రాధాకృష్ణ, బొమ్మిడి మూర్తి ఆద్వర్యంలో అధిక సంఖ్యలో జనసేన, టీడిపి, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్ధి దేవ వరప్రసాద్ సమక్షంలో అగ్నికుల క్షత్రియ సామాజికవర్గం నుంచి మైల దుర్గా ప్రసాద్, పెమ్మడి సాయి, బొమ్మిడి నరసింహ స్వామి, నాగడి డీఎస్పీ, కొల్లు రాజేష్, కోపణాతి పెత్రు, బొమ్మిడి సామోరు, కోపణాతీ బాలకృష్ణ, బస్వాని లక్ష్మణ రావు, బొమ్మిడి శివ మరియు అధిక సంఖ్యలో పార్టీలో చేరారు ఈ కార్యక్రమం లో జనసేన, టీడీపి బీజేపీ పార్టీల రాష్ట్ర జిల్లా మండల గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.