కళ్యాణదుర్గంలో వాల్మీకుల ఆత్మీయ సమావేశం

కళ్యాణదుర్గం నియోజకవర్గం, కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రజావేదికలో నిర్వహించిన వాల్మీకుల ఆత్మీయ భారీ సమావేశానికి జనసేన పార్టీ వాల్మీకుల సామాజికవర్గం తరపున జనసేన పార్టీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బాల్యం రాజేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అదేవిధంగా పట్టణంలో వాల్మీకి కార్యకర్తలు, వాల్మీకి నాయకులు, వాల్మీకి మహిళలు, వాల్మీకి కులస్తులతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. తర్వాత ఈ సమావేశానికి జనసేన పార్టీ తరఫున కళ్యాణదుర్గం పట్టణ అధ్యక్షులు వంశీకృష్ణ, క్రమశిక్షణ కమిటీ సభ్యులు గంగరాజు, శెట్టూరు మండల ఉపాధ్యక్షులు చెర్లోపల్లి రామలింగ, కుందుర్పి మండల ఉపాధ్యక్షులు ప్రసన్న కుమార్ జనసేన పార్టీ వాల్మీకుల సామాజికవర్గం తరఫున పాల్గొన్నారు.