గంగులయ్య ఆధ్వర్యంలో జనసేనలో చేరికలు

అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు, జి.మాడుగుల మండలం నుర్మాతి పంచాయితీ మద్దివీధి గ్రామస్తులు పాడేరు, అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ డా.గంగులయ్య చేతుల మీదుగా కండువాలు కప్పుకుని జనసేన పార్టీలో చేరారు. వంతల బలరామ్, గోల్లోరి అర్జున్, వంతల త్రినాద్, గోల్లోరి బాబూరావు, గొల్లరి అర్జున్, కోడా సురేష్ శుక్రవారం పార్టీ జిల్లా కార్యాలయంలో జనసేన లక్ష్యాలు, ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి మేము పార్టీలోకి చేరమని మా లాంటి అభిమానులు, జనసైనికులు మారుమూల గ్రామాల్లో చాలామంది ఉన్నారని, స్వతహాగా మేము పవన్ కళ్యాణ్ అభిమానులమని తెలిపారు. డా.గంగులయ్య మాట్లాడుతూ ఇవాళ పాడేరు నియోజకవర్గంలో ప్రజలు స్వచ్ఛందంగా జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు కారణం నీతి, నిజాయితితో కూడిన రాజకీయాలే లక్ష్యంగా వస్తున్న జనసేనపార్టీకి రోజు రోజుకి ఆదరణ పెరుగుతుందనడానికి జనసేనపార్టీలో ఈ చేరికలే ప్రధాన కారణమని అన్నారు. ఈ విధంగా గిరిజన ప్రాంతంలో కూడా మార్పు మొదలైందని త్వరలోనే అన్ని మండలాలలో విస్తృత సమావేశాలు, పార్టీబలోపేత నిర్ణయాలు ప్రజలతో మమేకమౌతూ క్షేత్ర స్థాయిలో పార్టీ ప్రణాళిక అమలు చేస్తామని పార్టీలో ఈ చేరికలకు ప్రధానంగా కృషి చేసిన, తల్లే త్రిమూర్తులు, శివప్రసాద్ లకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామని పాడేరు, అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్చార్జ్ డా.గంగులయ్య తెలిపారు.