పంతం నానాజీ సమక్షంలో జనసేనలో చేరికలు

కాకినాడ రూరల్ మండలం, సర్పవరం గ్రామం గాంధీనగర్ కి చెందిన 50 మంది వైసీపీకి చెందిన యువత, పెద్దలు పుల్ల శ్రీరాములు, పుల్ల శ్రీనివాస్, పుల్ల వీరబాబు నాయకత్వంలో ఆదివారం కాకినాడ గొడరిగుంటలో జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ సమక్షంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. వారందరికీ పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాధారంగా ఆహ్వానం పలికారు. వీరంతా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వం, జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి నేడు జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ పార్టీ అభివృద్ధికి పాటుపడాలని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేసే విధంగా కృషి చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.