చిన్నంపల్లి గ్రామంలో టిడిపి, జనసేన, బిజెపిల ఉమ్మడి ప్రచారం

శెట్టూరు మండలం(చిన్నంపల్లి): కళ్యాణదుర్గం నియోజకవర్గం, శెట్టూరు మండలం, చిన్నంపల్లి గ్రామంలో టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుకి మద్దతుగా వారి కుటుంబ సభ్యులతో కలిసి ఇంటింటా టిడిపి, జనసేన ఉమ్మడి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ ఇంచార్జ్ బాల్యం రాజేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ప్రచారంలో ఇంటింటికి మేనిఫెస్టో అంశాలను, మహాశక్తి పథకాలను తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం జనసేన వీరమహిళలు షేక్ తార, మమత, కల్పన, శెట్టూరు మండల అధ్యక్షులు కాంత్ రాజు, మండల ఉపాధ్యక్షులు చెర్లోపల్లి రామలింగ, ఎర్రిస్వామి, మండల కార్యదర్శులు ఆర్.ఎం.పి డాక్టర్ వెంకటేష్, కళ్యాణదుర్గం ముఖ్య నాయకులు గంగరాజు, పట్టణ అధ్యక్షులు వంశీకృష్ణ, కుందుర్పి మండల అధ్యక్షులు జయకృష్ణ, కళ్యాణదుర్గం మండల ప్రధాన కార్యదర్శులు అనిల్ పాల్యం, కార్తీక్, కళ్యాణదుర్గం మండల కమిటీ సభ్యులు చిత్తప్ప, రుహుల్ల, కళ్యాణదుర్గం నాయకులు మోహన్, సతీష్, నియోజకవర్గ జనసేన పార్టీ మీడియా ఇంచార్జ్ రాయుడు మరియు టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.