వినాయకుని అన్నసంతర్పణలో పాల్గొన్న జ్యోతుల

పిఠాపురం: గొల్లప్రోలు మండలం, దుర్గాడ గ్రామంలో చేనేత సహకార సంఘ భవనం వీధి నందు ఏర్పాటు చేసిన వినాయకుని నవరాత్రుల మండపం కమిటి వారు వినాయక నవరాత్రుల సందర్భంగా శనివారం మధ్యాహ్నం అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వినాయక నవరాత్రుల కమిటీ వారు ఆహ్వానం మేరకు జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు అన్నసంతర్పణ కార్యక్రమంలో పాల్గొని వినాయకుని దర్శించుకొని అనంతరం స్వామి వారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా అన్నసంతర్పణ కు 50 క్గ్ల సన్నబియ్యంను చందాగా సమకూర్చారు. ఈ కార్యక్రమంలో వినాయక నవరాత్రుల కమిటి వారు, చేశెట్టి సూర్యనారాయణ, మేడిబోయిన సత్యనారాయణ, చేశెట్టి బాబురావు, తీడా శివ, బండి శివ, తీడా శ్రీను తదితరులు ఉన్నారు.