అపర్ణేశ్వరిని అభినందించిన జ్యోతుల శ్రీనివాస్

గొల్లప్రోలు: గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పదో తరగతి పరీక్షలలో మండలస్దాయిలో ద్వితీయర్యాంకు, దుర్గాడ హైస్కూల్ స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించిన విద్యార్థినీ పిడుము అపర్ణేశ్వరిని జనసేన నాయకులు, సాయిప్రియ సేవాసమితి అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాసు గురువారం అభినందించారు. ఈ సందర్భంగా పిడుము ఆపర్ణేశ్వరికి పూవ్వులబోకెను అందించి, శాలువాతో సంత్కారించి 2000/-రూపాయిల నగదును బహుకరించారు. అనంతరం విద్యార్థిని తండ్రిని, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి.లక్ష్మణ స్వామిని శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని, వారి తల్లిదండ్రులను, చదువు చెప్పిన ఉపాద్యాయులను సత్కరించవలసిన భాద్యత మన అందరి పైన ఉన్నదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం జనసేన నాయకులు అల్లం కిషార్, జ్యోతుల వాసు, కోలా నాని, కీర్తి చిన్నా, జీలకర్ర బాను, నేమాల కన్నా, ఉపాధ్యాయిని పి.రాజ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.