సత్తెమ్మతల్లి ఉత్సవాలకు హాజరైన జ్యోతుల శ్రీనివాసు

పిఠాపురం, గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామం నందు దేవినవరాత్రులు సందర్బంగా పందిగుంట, ఎర్రబంద ప్రాంతంలో గల వ్యవసాయక్షేత్రాలలో గల సత్తెమ్మతల్లి పండుగలను ఆయా ప్రాంతాల రైతులు సామూహికంగా, స్వచ్ఛందంగా నిర్వహించుకొనుచున్నారు. సత్తెమ్మతల్లి పండుగలో భాగంగా అన్నసంతర్పణ కార్యక్రమాలను రైతులు ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయాప్రాంత రైతులు, చేబ్రోలు గ్రామ జనసేన నాయకులు ఆహ్వానం మేరకు పిఠాపురం జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు వ్యవసాయ క్షేత్రాలలో పందిగుంట, ఎర్రబంద ప్రాంతంలో గల సత్తెమ్మ తల్లి గుడిలను సందర్శించి సత్తెమ్మతల్లిని పిఠాపురం జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు దర్శించుకున్నారు. అనంతరం రైతులు ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని వచ్చిన భక్తులకు అన్నవడ్డన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రైతులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలలో అల్లం దొరబాబు, బుద్దాల గంగాధర్, ఓరుగంటి నాగేశ్వరరావు, పెద్దింటి శివ, గంటా గంగ, దిబ్బిడి సురేష్, ఆకుల శ్రీను, వ్యవసాయ క్షేత్రాల రైతులు బుద్దాల బ్రదర్స్, బావిశెట్టి వెంకటరమణ, చల్లా దివాణం, భావిశెట్టి పాపారావు, చల్లా రామ సత్యనారాయణ, బావిశెట్టి శ్రీను, చల్లా అప్పలరాజు, బావిశెట్టి అర్జున్, బావిశెట్టి వరాలు, దుర్గాడ గ్రామానికి చెందిన జ్యోతుల సీతారాంబాబు, మేడిబోయిన హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.