అంచులవారిపాలెంలో ఘనంగా క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ

సత్తెనపల్లి నియోజకవర్గం: రాజుపాలెం మండలం, అంచులవారిపాలెం గ్రామంలో సోమవారం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్క కార్యకర్త ఇంటికి వెళ్లి సభ్యత్వ కిట్లు అందజేయడం జరిగింది. క్రియాశీలక సభ్యత్వం అనేది జనసేన అధినేత కళ్యాణ్ గారి గొప్ప ఆలోచనా విధానానికి నిదర్శనం పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళళు హర్షం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ సభ్యత్వం పొందడం అంటే జనాన్ని దోచుకునే అవినీతి పరమైన మరియు అనైతిక రాజకీయాలకు అతీతంగా నిజమైన జనసేవకుడు కంకణం కట్టుకోవడమేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజుపాలెం మండల కార్యదర్శి క్రియాశీలక వాలంటీర్ తమ్మిశెట్టి మహేష్ బాబు, మండల సంయుక్త కార్యదర్శి గలబా నాగేశ్వరరావు, బూత్ కమిటీ తోట నాగేశ్వరావు, తోట సుబ్బారావు, వేపూరి వెంకటేశ్వర్లు, అంచుల చిన్న వెంకయ్య, అంచుల శ్రీకాంత్, తోటశివరావు, లింగంపల్లి కొండలు, అంచుల కుమారస్వామి, పోకల వీరయ్య నాయకులు కార్యకర్తలు వీరమహిళలు పాల్గొన్నారు.