అన్నసంతర్పణ కార్యక్రమంలో పాల్గొన్న జ్యోతుల శ్రీనివాసు

  • గణపతి నవరాత్రులు అనంతరం జరిగిన అన్నసంతర్పణ కార్యక్రమంలో జనసేన ఇన్చార్జి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాసు ఆదేశసానుసారం పాల్గొన్న జనసేన నాయకులు జ్యోతులశ్రీనివాసు, కొల్లికొండ శశిధర్ యాదవ్

పిఠాపురం: గొల్లప్రోలు మండలం, చేబ్రోలు గ్రామం బాబులు గరువు వీధిలో మహా అన్నదాన కార్యక్రమాన్ని వినాయకుని నవరాత్రుల మండపం కమిటి వారు బుధవారం అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వినాయక నవరాత్రుల కమిటీ వారు, జనసేన నాయకుల ఆహ్వానం మేరకు ముఖ్యాతిధిలుగా జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు, బిసి నాయకులు కొల్లికొండ శశిధర్ యాదవ్ అన్నసంతర్పణ వడ్డన కార్యక్రమంలో పాల్గొని వినాయకుని దర్శించుకొని అనంతరం కమిటీ వారు ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నక్కా బద్రీ, చేబ్రోలు జనసేననాయకులు, జనసైనికులు దూళిపూడి జయ పడాల సతీష్, మట్ల సత్తిబాబు, దిబ్బడి సురేష్, చేదులూరు సురేష్, బావిశెట్టిస్వామి, చేదులూరి గంగాధర్, బావిశెట్టి శివ, మంగఒ మణికంఠ, బావిశెట్టి బాబి, తుమ్మలపల్లి శ్రీను, గంట గోపి, మేడిబోయిన గోపికృష్ణ, ఇంద్ర తదితరులు పాల్గొన్నారు.