జనవాణి కార్యక్రమంలో జనసేనానికి అర్జి ఇచ్చిన కైకలూరు జనసేన

కైకలూరు నియజకవర్గం, కలిదిండి మండలంలోని కలిదిండి-కైకలూరు మధ్య ఉన్న రోడ్ అలాగే గుర్వాయి పాలెం-మూలలంక మధ్య ఉన్న రోడ్డు ఇంకా పలు రోడ్లు అస్తవ్యస్థంగా తయారయ్యాయి. అలాగే కోరుకోలు-పెదలంక డ్రైన్ మీద వంతెన 2009లో శిథిలావస్థకు చేరగా అప్పట్లో ఉన్న గవర్నమెంట్ దాని పక్కనే మరో వంతెన నిర్మాణం ప్రారంభం చేసి మధ్యలో వదిలేసారు. ఇలా పలు సమస్యలను జనవాణి కార్యక్రమం ద్వారా గౌరవనియులైన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి అర్జి ఇవ్వడం జరిగింది. ఈ సమస్యలను పవన్ కళ్యాణ్ ముందుకు తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కైకలూరు నియోజకవర్గ నాయకులు వలవల రవితేజ, కలిదిండి మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చిన్నాపరపు నాగార్జున, కలిదిండి మండల జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి విన్నకోట సుధాకర్ మరియు కేసిరెడ్డి సాయి పాల్గొనడం జరిగింది.