కలువాయి జనసేన ఆధ్వర్యంలో పల్లెబాట

కలువాయి మండల జనసేన ఆధ్వర్యంలో జనసైనికుల పల్లెబాట కార్యక్రమంలో భాగంగా శనివారం పర్లకొండ గ్రామానికి వెళ్లి అక్కడున్న ప్రజలతో మమేకమై వాళ్లకి జనసేనపార్టీ సిద్ధాంతాల్ని, ఆశయాలను, పవన్ కళ్యాణ్ చేపట్టిన కార్యక్రమాలను మరియు క్రియాశీలక సభ్యత కార్యక్రమాన్ని అక్కడున్న ప్రజలకు వివరించడం జరిగింది. క్రియాశీలక సభ్యత్వం వల్ల కలుగు ప్రయోజనాలను ప్రజలకు తెలియపరచి అక్కడున్న ప్రజలచేత సభ్యత్వం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీరామ్ వెంకటపతి, సుంకు రామ కిషోర్, నరేష్, రామకృష్ణ, శ్రీహరి మరియు వీర మహిళ ప్రవళిక తదితరులు పాల్గొనడం జరిగింది.