కోలుకుంటున్న కపిల్

టీమ్‌ఇండియా దిగ్గజ సారథి కపిల్‌ దేవ్‌ గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. అయితే, ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, స్వయంగా కపిల్ దేవ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగుందని, క్షేమంగా ఉన్నానని ఆస్పత్రిలో కపిల్‌.. తన కూతురు ఆమ్యాతో కలిసి దిగిన ఫొటోను ట్విటర్‌లో పోస్టు చేసిన ఆయన ఈ విషయాన్ని చెప్పారు. తన ఆరోగ్యం గురించి ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా కపిల్ ఆరోగ్య పరిస్థితిపై అభినానులతో పాటు, పెద్ద ఎత్తున సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తమ అభిమాన ఆటగాడు త్వరగా కోలుకోవాలని, క్షేమంగా తిరిగి రావాలని అందరు ఆకాంశించారు. ఈ నేపథ్యంలో స్వయంగా టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తన ఆరోగ్యంపై ట్వీట్ చేయడం అందరికి ఆనందం కలిగించింది. తమ ప్రార్థనలు సఫలమయ్యాయని అంటున్నారు.