స్పోర్ట్స్‌ వర్సిటీ వీసీగా కరణం మల్లీశ్వరి

ఢిల్లీ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ క్రీడాకారిణి కరణం మల్లీశ్వరి నియమితులయ్యారు. ఈమేరకు ఢిల్లీ ఉన్నత విద్యాశాఖ సంచాలకులు అజ్మిల్‌ హఖ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళానికి చెందిన కరణం మల్లీశ్వరి 2000 సంవత్సరంలో ఒలింపిక్‌ క్రీడల్లో పాల్గొని భారత్‌కు కాంస్య పతకం సాధించారు. 1999 కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో మల్లీశ్వరిని సత్కరించింది.