తాళ్ళవలస గ్రామ ఉపాధి కూలీలతో కరిమజ్జి మల్లీశ్వారావు భేటీ..!

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలం తాళ్ళవలస గ్రామ చెరువులో జనసేన పార్టీ నాయకులు సోసైటి బ్యాంకు మాజీ చైర్మన్ కరిమజ్జి మల్లీశ్వారావు, జనసేన పార్టీ యంపీటిసి అభ్యర్థి పోట్నూరు లక్ష్మునాయుడు, అదపాక గ్రామ జనసేన నాయకులు పతివాడిపాలెం జనసేన నాయకులు రెడ్డి.వెంకటరమణ బుధవారం పర్యటించి.. చెరువులో ఉన్న ఉపాధి కూలీలు ప్రతి ఒక్కరినీ కలవడం జరిగింది. జనసేన పార్టీ మేనిఫెస్టో గురించి ప్రతి మహిళకు, యువతకు,పెద్దలకు, తెలియజేస్తూ.. పవనన్న ప్రజాబాట ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించి 50 రోజులు పాటు సుదీర్ఘంగా ప్రజల దగ్గరకు వెళ్ళి పలు కుటుంబాలను పలకరిస్తూ.. ముందుకు సాగడం జరిగింది. ఈ సందర్భంగా కరిమజ్జి మల్లీశ్వారావు ఉపాధి కూలీలతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన రైతు భరోసా యాత్రలో బాగంగా 3000 మంది చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలను నేరుగా పరామర్శించి.. ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు విరాళం అందిస్తున్న.. గొప్ప మనసున్న నాయకుడిని కాపాడు కోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అలాగే వివిధ విషయాలు గురించి వివరించి వాళ్లకు అవగాహన కల్పించారు. కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని అన్నారు. అలాగే వృద్దులతో మాట్లాడుతూ.. సామాన్య ప్రజలకు న్యాయం జరగాలంటే.. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని అన్నారు. పవనన్న ప్రజాబాట తాము ప్రారంభించిన ప్రజలనుండి అపూర్వ స్పందన లభిస్తోందన్నారు. గత ఎన్నికల సందర్భంగా ఒక్క ఛాన్స్ జగన్ కి ఇద్దాం అని ఓటేసిన వారెవరూ ఈసారి వైసిపి కి ఓటు వేసేందుకు సిద్ధంగా లేరన్నారు. ఈ కార్యక్రమంలో తాళ్ళవల‌స గ్రామ పెద్దలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.