గ్రామ పెద్దలను కలిసిన కరిమజ్జి మల్లీశ్వారావు!!

ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలం, గురువుబిల్లి గ్రామంలో మంగళవారం జనసేన పార్టీ నాయకులు కరిమజ్జి మల్లీశ్వారావు మరియు పోట్నూరు లక్ష్మునాయుడు మాట్లాడుతూ.. జనసేనకు ఈసారి అవకాశం ఇవ్వాలని అలాగే, జనసేన పార్టీ సిద్దాంతాలను పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాలను మరియు ఆచరించే విధానాలను ప్రజలకు కరిమజ్జి మల్లీశ్వారావు వివరించితిరి. టిడిపి. వైసీపీ ప్రభుత్వ పాలన చూశారు.. ఒక్కసారి అవకాశం ఇచ్చి జనసేన పార్టీ పాలన కూడా ప్రజలు చూడాలని ఆయన కోరారు. రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాల వారికి మేలు చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు వంటి పవన్ కళ్యాణ్ గారికి వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి ఓటు వేయాలని కరిమజ్జి మల్లీశ్వారావు మరియు పోట్నూరు లక్ష్మునాయుడు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు చిట్టిబాబు, అప్పలరాజు రామారావు, సత్యం, సూర్యారావు, చిన్న తదితరులు పాల్గొన్నారు.