స్వాతంత్ర్య సంబరాలు ప్రారంభించిన కేసీఆర్‌

హైదరాబాద్‌: ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ పేరిట స్వాతంత్ర్య సంబరాలు నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌లో ప్రారంభమయ్యాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ”భారత స్వాతంత్ర్య చరిత్ర ప్రపంచ పోరాటాల చరిత్రలోనే ఒక మహోజ్వల ఘట్టం” అని వివరించారు. ఈ సందర్భంగా పబ్లిక్ గార్డెన్స్‌లో కళారూపాల ప్రదర్శన ఆకట్టుకుంది. శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.