పాలకొండలో క్రియాశీలక సభ్యుల కిట్ల పంపిణీ కార్యక్రమం

మన్యం జిల్లా: పాలకొండ నియోజకవర్గం, పాలకొండ పట్టణం.. గారమ్మ కాలనీలో గురువారం జనసేన పార్టీ క్రియాశీలక వాలంటీర్, జనసేన నాయకులు పోరెడ్డి ప్రశాంత్ ఆధ్వర్యంలో.. క్రియాశీలక సభ్యుల కిట్ల పంపిణీ కార్యక్రమం పచ్చని పంటపొలాలే వేదికగా వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు పాల్గొని వారి కిట్లను అందుకున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు పోరెడ్డి ప్రశాంత్ మాట్లాడుతూ.. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని మనం ఎంతగా ప్రేమిస్తున్నామో దానికి వెయ్యి రెట్లు ఆయన మనల్ని ప్రేమిస్తున్నారని.. అందులో భాగమే జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు అనీ.. ఈ సభ్యత్వం ద్వారా ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగినపుడు హస్పిటల్ ఖర్చులకు ₹50000,దురదృష్టావశాత్తు మరణిస్తే వారి సభ్యులకు ₹500000-ఇవ్వటంద్వారా కార్యకర్తల కుటుంబాలకు ఎంతో భరోసా నిస్తుందని తెలియజేశారు. ప్రతి క్రియాశీలక సభ్యుడు మీ ఇంటినుండి మీ కుటుంబ సభ్యులను జనసేన పార్టీ కి ఓటు వేసేవిధంగా మార్పు తీసుకురావాలని ఈ సందర్భంగా పొట్నూరు రమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో గొర్ల మన్మధ, కడగల హరిక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.