కోనసీమ చెవిటి, మూగ, స్కూల్ లో అన్నదాన కార్యక్రమం

రాజోలు శ్రీరామనవమి పండుగ సందర్భంగా శ్రీ సుంకర గణపతి రావు ట్రస్ట్ ఆధ్వర్యంలో సుంకర గణపతి రావు కుమారుడు సుంకర వెంకట రమేష్ ఆర్థిక సహాయంతో రాజోలు గ్రామంలో ఉన్న కోనసీమ చెవిటి, మూగ, స్కూల్ లో అన్నదానం కార్యక్రమం చేశారు. అనంతరం పిల్లలకు మిఠాయి కూల్ డ్రింకులు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజోలు జనసేన జనరల్ సెక్రటరీ గురుజు భీమరాజు, జనసేన ఎంపిటిసి అభ్యర్థి చింత లక్ష్మీ ప్రసాద్, బి సావరం జనసేన కుంపట్ల గణేష్, మలికిపురం జనసేన ఎంపిపి శ్రీమతి మేడిచర్ల వెంకట సత్యవణి రాము రాజోలు జనసేన వైస్ ఎంపిపి ఇంటిపల్లి ఆనందరాజు, జనసేన క్రియాశీలక సభ్యుడు సూర్య నంద్యాల, బొక్క ఆనంద్, చేగొండి కిరణ్, వీర మహిళలు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కోనసీమ చెవిటి మూగ స్కూల్ ఆర్గనైజర్ మాట్లాడుతూ సుంకర వెంకట రమేష్ చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడడం జరిగింది.