ట్రిపుల్ ఐటికి ఎంపికైన విద్యార్ధులకు అభినందనలు తెలిపిన కొంకాల రామ్మోహన రావు

మార్కాపురం నియోజకవర్గం, మార్కాపురం మండలం మిట్టమీది పల్లెలోని ఆదర్శ పాఠశాలకు చెందిన విద్యార్ధులు పుల్లలచెరువు సాయిప్రణతి, టి.శ్రీలేఖ, కె.మేఘన సాయి, ఎస్.దేవిక, ఎల్.మానస, జి.సిరి, జి.మేరి జాయ్ లు ట్రిపుల్ ఐటికి ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్ధులు అత్యున్నత స్థాయికి వెళ్ళాలని వారికి మార్కాపురం జనసేన నాయకులు శ్రీ కొంకాల రామ్మోహన రావు అభినందనలు తెలియజేసారు.