పోలమూరులో జనసేన నాయకుల విస్తృత పర్యటన

ఆచంట నియోజకవర్గం, పెనుమంట్ర మండలం, పోలమూరు గ్రామంలో గ్రామ సమస్యలపై శనివారం ఆచంట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్, రాష్ట్ర పీఏసీ సభ్యులు చేగొండి సూర్యప్రకాష్ మరియు పెనుమంట్ర మండల అధ్యక్షులు కోయ వెంకట్ కార్తీక్ విస్తృత పర్యటన చేయడం జరిగింది. పర్యటనలో భాగంగా పొలమూరు గ్రామంలో ఉన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పొలమూరు గ్రామ అధ్యక్షులు తోరం వెంకన్న బాబు, ఎంపీటీసీ మాచిరెడ్డి నాగదుర్గ, వార్డ్ మెంబర్స్, పొలమూరు జనసేన పార్టీ గ్రామ కమిటీ సభ్యులు, పెనుమంట్ర మండల కమిటీ సభ్యులు, పెనుమంట్ర మండల గ్రామాల జనసేన నాయకులు, వీర మహిళలు పాల్గొనడం జరిగింది.