విధినిర్వహణలో గాయపడిన కేపీహెచ్‌బీ ఏఎస్సై మృతి !

హైదరాబాద్: విధి నిర్వహణలో గాయపడిన కేపీహెచ్‌బీ ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి మృతి చెందాడు. ఈ నెల 27న నిజాంపేట రోడ్‌లో ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి, హోంగార్డు కలిసి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న క్యాబ్ డ్రైవర్ వారిని ఢీకొట్టాడు.

దీంతో ఏఎస్ఐ తీవ్రంగా గాయపడటంతో ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ మహిపాల్ రెడ్డి బుధవారం ఉదయం కన్నుమూశారు. ఏఎస్ఐ నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.