అంగన్వాడీ వర్కర్లకు కుప్పం జనసేన నాయకుల మద్దతు

కుప్పం నియోజకవర్గం: నియోజకవర్గంలోని శాంతీపురం మరియు రామకుప్పం మండల అంగన్వాడీ వర్కర్లు తమ డిమాండ్ల సాధనకై చేస్తున్న శాంతియుత ధర్నాలో జనసేన నాయకులు పాల్గొని మద్దతు తెలుపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర మత్స్యకార కార్యవర్గ సభ్యులు వామనమూర్తి, ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి రామమూర్తి, సంయుక్త కార్యదర్శి వేణు, జిల్లా కార్యవర్గ సభ్యులు నవీన్, మండల అధ్యక్షులు, మండల కార్యవర్గ సభ్యులు శ్రీకాంత్, బాస్కర్, రవీంద్ర, సురేష్, ధనుష్ మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.